ఈ మధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు మా బాబాయి గారింట్లో "సావిత్రి"అనే ఒక పుస్తకం చుశాను."సావిత్రి" అంటే శ్రీ అరబిందో రాసినది అనుకునేరు. కాదు. ఇది చిన్న పుస్తకం. అందులో చాలా వ్యాసాలు, వివిధ ధార్మిక విషయాల పైన ఉన్నాయి. అన్నిటిలోకి నన్ను ఆకట్టుకున్న వ్యాసం ఒకటే. అది "తిరుపతి వేంకటేశ్వర స్వామి నిజంగా ఎవరు" అన్న విషయం మీద చెలరేగుతున్నా వాదవివాదాల పై రాసినది. రచయిత పేరు గుర్తులేదు. కానీ వ్యాసం మాత్రం చాలా ఆసక్తిదాయకం గా ఉంది.

అలా పిసుకుతూ, మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కానీ, తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
ఇంకా అసలు విషయానికి వస్తే, తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడు అసలు విష్ణు రూపం కాదని ఒక సిద్ధాంతం ఉంది. మూలవిరాట్టుకు వెనుక భాగంలో జడ ఉందని అందువలన ఆ విరాట్టు శక్తి రూపమనీ శాక్తేయుల వాదన. అందుకు తోడు వేంకటేశ్వరుని "బాలాజీ" అని ఉత్తరాది ప్రజలు పిలవటం కూడా ఉన్నది. ఇది "బాల" రూపం అని వారి వాదన. ఇంకోవిషయం ఏమిటి అంటే, స్వామివారికి జరిగే కొన్ని పూజలు శాక్తేయులు అమ్మవారికి మాత్రమే చేస్తారనీ, అవి విష్ణు సాంప్రదాయంవి కాకపోయినా, ఇంకా ఆచారంలో ఉన్నాయని, దీనిబట్టి ఆ మూలవిరాట్టు బాలత్రిపుర సుందరి" దే అని వాదన. ఇంకో విషయం గమనించాలిందేమిటి అంటే, జగద్గురు ఆదిశంకరులు ఈ స్థలం దర్శించినప్పుడు, మూలవిరాట్టు పాదాల వద్ద శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. విష్ణు పాదాల వద్ద శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్టించారు అనేది అనేక సందేహాలకు దారి తీస్తుంది. శిల్పశాస్త్రం ప్రకారం మూలవిరాట్టు విగ్రహం స్త్రీమూర్తి కొలతలకు సరిపోతాయని, వక్షస్థలంని మూసివేస్తూ శ్రీదేవి, భూదేవులను ఉంచారనేది వీరి వాదన. ఇదే విధంగా శైవులు శ్రీ వేంకటేశ్వరుని శివరూపంగా భావిస్తారు. అందుకు తగిన ఆధారాలు వారు చూపించారు. గుడిపై ఉన్న శిల్పాలలో నంది ఉండటం ఇప్పటికి గమనించవచ్చు. వైష్ణవ ఆలయాలలో ఇది జరగదు. స్వామి పేరులో కూడా ఈశ్వరుడు అని ఉండటం గమనించండి. (వేం= పాపములను కట = తొలగించు ఈశ్వరుడు = దేవుడు, శివుడు?). శివుని మూడవనేత్రం కప్పి ఉంచటానికే పెద్దనామం(తిరునామం) పెట్టారన్నది వీరి వాదన.
ఐతే, ఇప్పటికీ తేలని విషయం ఏమిటి అంటే, వేంకటేశ్వర స్వామి నిజంగా ఏ రూపం అనేది. విష్ణువా? శివుడా? శక్తిరూపమా? ఇంకెవరైనా నా? అఏమో తెలియదు. కాని ఈ వ్యాసం చదవగానే నాకు గుర్తు వచ్చినది"అన్నమయ్య కీర్తన"...
ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ, మహావైష్ణవుడైన శ్రీ రామానుజులవారు స్వామికి శంఖ చక్రాలను అమర్చి, ఈ క్షేత్రాన్ని శ్రీవైష్ణవ క్షేత్రంగా ప్రకటించారన్నది చారిత్రిక సత్యం.
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమేనీవు
అంతరాంతరము లెంచి చూడ బిండంతె నిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులూ కురిమితో విష్ణుడనిపలుకుదురూ మిము వేదాంతులు పర బ్రహ్మంబనుచూతలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచుఅలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచూ
సరి నెన్నుదురు శాక్తేయులును శక్తిరూపు నీవనుచూదరిశనములు నిను నానా విధులను తలపుల కొలదుల భజింతురుశిరుల మిము ఏ అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువుదరిమల మిముఏ ఘనమని తలచిన ఘన బుద్దులకు ఘనుడవు
నీవలన కొలతేలేదు మరి నీరుకొలది తామరవుఆవల భాగీరధి బావుల ఆజలమే ఊరినయట్లుశ్రీవేంకటాపతి నీవైతే మము చేకొను ఉన్నదైవముఈ వలనే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు
అంటే, అన్నమయ్య కాలానికే ఈ వివాదం ఉండేదని తెలుస్తోంది. నిజానిజాలు ఆ వేంకటేశ్వరునికే తెలియాలి మరి.
2 comments:
ఈ కథ ఇప్పుడు తెలిసిందా మీకు... నా చిన్నప్పుడెప్పుడో చదివినట్టు గుర్తు...
శివ కేశవులకు బేధం లేదని ఆ దేవుళ్ళే మొత్తుకుంటున్నా మన వారు మాత్రం మీరు వేరు వేరు అని అంటూనే ఉన్నారు..ఎన్నటికి తెలుసుకుంటారో ఇద్దరూ ఒకటే అని
Post a Comment