మన జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాము. ఎన్నో సంఘటనలు తారసపడుతుంటాయి. చాలావరకు సామాన్యమైనవిగానే ఉన్నా కొన్ని సంఘటనలు మర్చిపోలేము. కొన్ని సంఘటనలను నమ్మలేము. మన కళ్ళు మనలని మోసం చేసాయా అనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి సంఘటనలు మన దైనందిన జీవితాల్లో కనపడవు. కొన్ని సార్లు మనకి తెలిసినా ఎదో కాకాతాళీయంగా జరిగింది అని వదిలేస్తాము. చాలావరకు సంఘటనలు ఇలాంటివే.
అవి నెను 9 తరగతి చదువుకునే రోజులు. హైదరాబాదులో విద్యానగర్లో ఉండేవారము. ఆరోజు ఆదివారం అవటం వలన నేను మా ఫ్రండ్ ఉదయ్ ఇంట్లోనే ముందు వసారాలు చెస్ ఆడుకుంటూ కూర్చున్నాము. మా అమ్మ వంతింట్లో పూజ చేసుకుంటూ వంటపనిలో ఉంది. ఈలోగా బయట అమ్మా అనే పిలుపు వినిపించింది. ఎవరో ముష్టివాడు అనే ఆలోచనలో మేము పట్టించుకోలేదు. ఆమనిషి ఈలోగా గేత్ తీసుకొని లోపలికి వచ్చాడు. మంచి తెల్లని తెలుపు, పొడుగాటి గడ్డం, కాషాయ బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈలోగా మా అమ్మ చాతలో బియ్య తెచ్చింది అతనికి వెయ్యటానికి. ఐతే అతను తీసుకోవటనికి ఒప్పుకోలేదు. ' మీ ఇంట దేవీ పూజ చేస్తారు కాదా ప్రతిరోజూ ' అని అడిగాడు. మాఅమ్మ అవునని తలఊపింది. అతను మా అమ్మ చెయ్యి చాపమని చేతిలో చిటికెడు విభూతి ఇచ్చి ' మీ పూజ గదిలోకి వెళ్ళి చూడ ' మని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి ఈ సంగతంతా చూస్తున్న మాకు ఎంజరుగుతుందో చూద్దామని మా అమ్మ వెనకాలే వెళ్ళాము.
విచిత్రం. పూజ గదిలోకి వెళ్ళగానే మా అమ్మ చేతిలో విభూది కారబ్బంతి పువ్వుగా మారిపోయింది. మా కళ్ళని మేమే నమ్మలేదు. మా అమ్మకైతే అసలేమి అర్థం కాలేదు. ఇలాంతివన్ని కనికట్టు అనుకి ఆ పువ్వు తరవాత మళ్ళి బూడిద ఐపొతుందని బాగా నమ్మి ఆ పువ్వుని ఒక పూజా పుస్తకంలో జాగ్రత్తగా దాచాము. పువ్వు ఎండిపోయింది గానీ మాయం మాత్రం కాలేదు. ఎన్నో ఏళ్ళు అలానే ఆ రేకులు అదే పుస్తకంలో ఉండేవి.
ఇది చదివిన చాలామందికి నేనేదో కథ చెప్తున్నా అనిపించవచ్చు. మరికొంత మంది ట్రాష్ అని కొట్టిపడేయవచ్చు. నాకు ఇలాంటివి నమ్మకం లేకపోయినా కళ్ళతో చూసింది కాదని ఎలా అనటం? ఇది నిజం. మీకెవరికైనా ఏమైనా వివరణ తెలిస్తే చెప్పండి.