Thursday, November 10, 2011

అనులోమ విలోమ కావ్యం

 శ్రీ రాఘవ యాదవ్యం అనే కావ్యం లో రామ కథ, కృష్ణ కథ ఒకేసారి వస్తాయి. దీనిని అనులోమ విలోమ కావ్యం అంటారు.


         అందులోంచి ఒక పద్యం .... 


వందేహం దేవం తం శ్రీతం
రంతారం కాలం భాసాయః
రామో రామాధీరాప్యాగో
లీలామారాయోధ్య వాసే
                  దీని అర్థం : సీత కొరకు పరితపించుచూ సహ్యాద్రి పర్వతములు దాటి, రావణుని చంపి, సీతతో అయోధ్యలో చాలాకాలము నివసించెనో, ఆ రామునికి నా నమస్సులు . 


         ఇప్పుడు ఇదే పద్యాన్ని తిరగ వేసి రాస్తే: 


సేవాధ్యేయో రామాలాలీ
గోప్యారాధీ మారామోరాః
యసాభాలంకారం తారం
తం శ్రీతం వందేహం దేవం
                  దీని అర్ధం : వక్షస్థలి లక్ష్మీ వాసమై, యజ్ఞ పూజాదులతో స్మరించ యుక్తుడో, రుక్మిణి మున్నగు భార్యలతో సరసమాడునో, గోపికలచే వందించ బడునో, నగలతో విరాజితుడై ఉండునో, అట్టి శ్రీ కృష్ణునకి నా నమస్సులు. 


2 comments:

rays said...

నమస్తే సుబ్రహ్మణ్యంగారు,
అద్భుతం గా ఉన్నాయండి ఈ పద్యాలు, మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
కవి పాండిత్యం తలుచుకుంటే....అన్నట్లు ఎవరండీ ఈ రాఘవ యాదవం వ్రాసినది?

D. Subrahmanyam said...

ధన్యవాదములు రేస్ గారు. ఈ కావ్యాన్ని కవి వేంకటాధ్వారి అనే ఆయన రచించారు.